ఇది కథ కాదు, నిజం. ద్వాపరయుగంలో పాండవులు అరణ్యవాసం పూర్తి చేసుకున్న తర్వాత, విజయవాడకు వచ్చారు. కృష్ణా నది ఒడ్డున వారు ఒక అద్భుతమైన ఆచరణ ప్రారంభించారు. నది తీరంలోని ఇసుకను సేకరిస్తారు. ఆ సేకరించిన ఇసుకను చేతిలో పట్టుకొని, ఆ తీరం నుంచి నడుచుకుంటూ వెళ్తారు. ఆ పక్కన ఉన్న ప్రదేశంలోకి ఇసుకను తీసుకువెళ్లి, ఇసుకతో శివలింగాన్ని నిర్మించారు. వారి ప్రార్థనలు, తపస్సు చూసి భగవాన్ పరమేశ్వరుడు వారి భక్తికి మెచ్చి, ఆ ఇసుక శివలింగాన్ని దివ్య శిలలో మార్చాడు. ఈ పవిత్ర స్థలమే ఇప్పటికీ మన ఓన్ టౌన్ శివాలయంలో ఉంది. పాండవుల భక్తి, శివుడి అనుగ్రహం, ఈ పుణ్యభూమి చరిత్ర అన్నీ ఇది తెలుపుతుంది.
te
Öffentlich
vor 9 Monaten
Proben
Es gibt noch keine Hörproben